జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత నిర్వహిస్తున్నామని, సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని అన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచనలు పాటించి జిల్లా పోలీస్ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు, అభ్యర్థులకు, నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆదివారం గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరిగే గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ, పరిసర ప్రాంతంలో ప్రజలు ఎవరు కూడా గుమికూడరాదని, ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అలాగే గెలుపొందిన అభ్యర్థులను ఆర్ఓలు ప్రకటించిన తరువాత ధృవీకరణ పత్రం అందుకునేందుకు అభ్యర్థి తోపాటు ఇద్దరికి మించి లోపలికి వెళ్లరాదని, అభ్యర్థుల విజయాలకు సంబంధించి ఎవరు కూడా ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదని తెలిపారు. అభ్యర్థుల ప్రకటనల అనంతరం ఆయా పార్టీల కార్యకర్తలు, ప్రజలు ఎవరు కూడా ఉద్రేకాలకు లోనై ఇతరుల మీదకు వెళ్లి గొడవలు సృష్టించినా, ఇతరులను భయబ్రాంతులకు గురి చేసిన, ఆస్తులను ధ్వంసం చేసిన, ఓడిన అభ్యర్థులను కించపరిచేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అట్టి వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎలక్షన్స్ కమీషన్ ఆఫ్ ఇండియా సూచించిన నిబంధనలు ప్రజలు తప్పక పాటించి పోలీస్ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలను కోరారు.
ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు-విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదు-జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు రుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES