ఓరుగల్లు9నేషనల్ టీవీ హన్మకొండ :ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోలింగ్ రోజున వెబ్ కాస్టింగ్ సక్రమంగా, సంపూర్ణంగా జరిగేలా సంబంధిత బాధ్యులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి తుది పర్యవేక్షణను నేడు ఐడీఓసీలోని వెబ్ కాస్టింగ్ కేంద్రంలో ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు వంద శాతం పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల వాహనాలకు సంబంధించిన వాహనాల్లోని జీపీఎస్ ట్రాకింగ్, సర్వైలెన్స్ ప్రక్రియ, పోలింగ్ సిబ్బంది, వారి విధుల నిర్వహణలో సంబంధిత నోడల్ అధికారులు పూర్తి అలర్ట్గా ఉండాలని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన నివేదికలను సమయానుసారంగా పంపించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
వెబ్ కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్
RELATED ARTICLES