జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జరిగే పోలింగ్ కు అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఇతర సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. బుధవారం గద్వాలలోని ప్రియదర్శని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల అధికారులు, సిబ్బంది 303పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని 34రూట్లకు ఆయా సెక్టోరియల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లతో తరలించినట్లు తెలిపారు. పోలింగ్ అధికారులు వివి ప్యాట్, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లను, పోలింగ్ సామాగ్రిని సరి చూసుకోవాలని ఆదేశించారు. కంట్రోల్ యూనిట్ ఆన్ చేసి, అభ్యర్థుల లిస్టు కరెక్టుగా ఉందా లేదా అన్నది పరిశీలన చేసుకోవాలన్నారు. ఈ నెల 30న ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటర్లు ఏపిక్ కార్డు అందని వారు12రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, చీర్ల శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి తరలింపు-పరిశీలించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES