జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 30న గురువారం జరిగే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. బుధవారం అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డులో, గద్వాల నియోజకవర్గానికి సంబంధించి గద్వాల పట్టణంలోని బీరెల్లి రోడ్డులో ఉన్న ప్రియదర్శిని మహిళ డిగ్రీ కళాశాలలో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ రితిరాజ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఎన్నికల సిబ్బందికి, కేంద్ర, యూపీ, కర్ణాటక పోలీస్ సిబ్బందితో సమన్వయంతో జిల్లా పోలీసు సిబ్బంది పనిచేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఉండేలా సంబంధిత అధికారులతో మాట్లాడి సరి చూసుకోవాలని, పోలింగ్ కేంద్రాల విధుల్లో ఉండే సిబ్బందికి ఏదైనా సమస్య వస్తే వెంటనే రూట్ మొబైల్ టీముకు సమచారం అందించాలని, వారు వెంటనే లోకల్ ఎస్సైకి సమాచారం అందిస్తే క్యూవ్ ఆర్ టీమును పంపించడం జరుగుతుందన్నారు. ప్రతి రూట్ మొబైల్ టీమ్ తమ రూటులో ఎన్ని పోలింగ్ కేంద్రాలు, ఎన్ని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, ఎన్ని గ్రామాలు ఉన్నాయో పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోలింగ్ కేంద్రం విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రతి ఐదుగురిని ఒక్కోసారి తనిఖీ చేసి లోపలికి పంపాలని సూచించారు. ఓటర్లు క్యూలైన్లు పాటించే విధంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే వారు, ప్రధానంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గల గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని, పలు జాగ్రత్తలు సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై నిఘా పెట్టాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని, ఎవరైనా ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడినా వెంటనే సంబంధిత పై అధికారులకు తెలపాలని అన్నారు. ఓటర్లకు భరోసా కలిగించే విధంగా ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి, డిఎస్పీ వేంకటేశ్వర్లు, సాయుధ దళ డిఎస్పీ ఇమ్మానియేల్, అలంపూర్, గద్వాల, శాంతినగర్ సిఐలు, ఎస్సైలు, సీఏపీఎఫ్, యూపి, కర్ణాటక, జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు సిబ్బంది కృషి చేయాలి-ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమన్వయంతో పని చేయాలి-జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES