జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యా యుడు వెంకటేశ్వర్లు పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థినిలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కొందరు విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు మంగళవారం పాఠశాలకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడుతో మాట్లాడారు. ఆయన వారికి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు గ్రామస్తులు ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లను దేహశుద్ధి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే గ్రామస్తులు ఫిర్యాదు చేయడానికి వెళితే అట్టి ఫిర్యాదును పోలీసులు తీసుకోకుండా విచారణ నిమిత్తం జిల్లా విద్యాధికారికి కేసును అప్పగించినట్లు తెలిసింది. కాగా ఇలాంటి సంఘటన గతంలో ఎర్రవల్లి చౌరస్తాలోని పాఠశాలలో చోటుచేసుకోగా విద్యాధికారులు విచారణ పేరుతో కాలయాపన చేసి ఆ ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా బదిలీ చేసి పంపించారు. ప్రస్తుతం కూడా అదే విధంగా చేస్తారేమోనన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇలాంటి ఉపాధ్యాయులను చూసి చూడనట్లు వదిలేయడంతోనే ఆయా పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మరో పాఠశాలలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోకుండా విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వారిలో మార్పు రాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. లేదంటే ఆడపిల్లలను పాఠశాలలకు పంపాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు -దేహశుద్ధి చేసిన గ్రామస్తులు తల్లిదండ్రులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES