Sunday, June 29, 2025

సోమవారం గద్వాలకు ప్రియాంక గాంధీ రాక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు చెన్నకేశవరెడ్డి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మేళ్లచెరువు చౌరస్తానందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రియాంక గాంధీ హాజరవుతున్నట్లు గద్వాల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు చెన్నకేశవరెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితకు మద్దతుగా ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు నియోజకవర్గంలోని గ్రామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో స్వతంత్ర అభ్యర్థులుగా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పూడూరు ఈశ్వర్, తిమ్మన్న గద్వాల అభ్యర్థి సరితకు మద్దతు ప్రకటించారు. ఆమె గెలుపుకు సహకారం అందిస్తామని అన్నారు. సమావేశంలో కేంద్ర ఎన్నికల పరిశీలకుడు సదా గౌడ, అమరవాయి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular