జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి సహకారంతో ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, చల్లా వెంకట్రామి రెడ్డి బలపర్చిన అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు భారీ మెజార్టీతో గెలవనున్నట్లు బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన నాయకులు ఆర్. కిషోర్ అన్నారు. శనివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభ్యర్థి విజయుడికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం అలంపూర్ చౌరస్తాలోని ఆర్. కిషోర్ కార్యాలయంలో ఎన్నికల ప్రచారం, నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఆయనను కలిసి మాట్లాడగా అలంపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాము అభ్యర్థి తరపున విస్తృతంగా పర్యటించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారు ప్రతి ఇంట్లో ఉన్నారని, దీంతో తాము ప్రచారం నిర్వహించే సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా అభ్యర్థి విజయుడుకి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి మద్దతు ఉండడంతో అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోందన్న నమ్మకంతో ప్రజలు ప్రస్తుతం విజయుడికే మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. అలాగే కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలకు ప్రజలు బాగా ఆకర్షితులయ్యారని, ఈ సారి కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుండడం, ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోకు కూడా ఆకర్షితులవుతున్నారని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈ సారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎమ్మెల్సీ చల్లా ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయుడు ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుపొందుతున్నారని అన్నారు.
ఆలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిదే గెలుపు-బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన నాయకులు ఆర్. కిషోర్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES