Sunday, June 29, 2025

బీఎస్పీ పార్టీతోనే గద్వాల అభివృద్ధి సాధ్యం-బీఎస్పీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి అతికూరు రెహమాన్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గం బాగుపడాలంటే బీఎస్పీ పార్టీని గెలిపించాలని గద్వాల బీఎస్పీ పార్టీ అభ్యర్థి అతికూర్ రెహమాన్ అన్నారు. బుధవారం గద్వాల మండలంలోని కొత్తపల్లి గ్రామంతోపాటు గద్వాల పట్టణంలోని గంజిపేట కాలనీలో ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి, రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ మరింత బలపడుతున్నదని తెలిపారు. గత పాలకులు గద్వాలలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. దళిత బంధు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గద్వాల నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి ఒక్కసారి బీఎస్పీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో 50 మంది కార్యకర్తలు బిఎస్పీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular