Sunday, June 29, 2025

ఎన్నికల విధులలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఎన్నికల విధులలో పాల్గొనే పిఓ, ఏపిఓలకు గతంలోనే అనుభవం ఉన్నప్పటికీ, ఈ నెల 30న జరగనున్న పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రంలో నిర్వర్తించే విధులలో అప్రమత్తంగా ఉండాలని, ప్రతిఒక్కరు ఈవీఎంలపై అవగాహన పెంచుకొని ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం ఎర్రవల్లి చౌరస్తాలోని ఏకశిలా పాఠశాల, గద్వాలలోని ఎంఏఎల్డి కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలపై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలో పనిచేసే సిబ్బందికి టెండర్ ఓటు, పోల్ ఓటుపై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటరుకు ఎపిక్ కార్డు లేకపోయినా ఎన్నికల సంఘం గుర్తించిన 12రకాల ఫోటో గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చిరునామాతో సంబంధం లేకుండా అనుమతించి ఓటును సద్వినియోగించుకునేలా చూడాలన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో 13మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 290పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఏ పోలింగ్ కేంద్రంలోనూ ఒక్క ఓటు కూడా దుర్వినియోగం కాకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ రోజు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై అవగాహన ఎంత ఉన్నా, ఖచ్చితమైన నిబంధనలను పాటించి విజయవంతం చేసినప్పుడే ఆ విధులకు సార్థకత లభిస్తుందని అన్నారు. అలాగే గద్వాల నియోజకవర్గంలో 303పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 20మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, రెండు బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని తెలిపారు. ఈ నెల 26న ఈవీఎంలపై మళ్ళీ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆ రోజే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని, 29న పంపిణీ కేంద్రం వద్ద ఉదయం 7గంటలకు ఉద్యోగులందరు రిపోర్ట్ చేయాలన్నారు. సెక్టార్ వారిగా కౌంటర్ ఏర్పాటు చేస్తారని ఎన్నికల సామాగ్రిని తీసుకున్నాక ఒకసారి వాటిని పరిశీలించుకోవాలన్నారు. కంట్రోల్ యూనిట్లను అక్కడే సరి చూసుకోవాలన్నారు. వివి ప్యాట్లను ఆన్ చేయరాదని తెలిపారు. భోజనం తర్వాత ఈవీఎం సామాగ్రితో నేరుగా పోలింగ్ స్టేషన్లకు వెళ్లాలన్నారు. 100మీటర్ల వరకు ఎలాంటి క్యాంపైన్లు లేకుండా చూసుకోవాలన్నారు. ముందు రోజే అన్ని సిద్ధం చేసుకొని,పోలింగ్ రోజు ఉదయం ఐదున్నర గంటలకు మాక్ పోల్ ను ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలన్నారు. ఎన్నికల అధికారులు ఎవరు కూడా సెల్ ఫోన్లు తీసుకురావద్దని తెలిపారు. వందశాతం వెబ్ కాస్టింగ్ ఉంటుందని, వాటిని అబ్జర్వర్లు పరిశీలిస్తారని తెలిపారు. వివిప్యాట్లలో ఏడు స్లిప్పులు వస్తాయని వాటిని పరిశీలించాక క్లియర్ చేసి స్లిప్పులను ఎన్వెలప్ పింక్ పేపర్ తో సీల్ చేయాలన్నారు. కంట్రోల్ యూనిట్లో ఓట్లు క్లియర్ చేయాలన్నారు.17ఏ రిజిస్టర్ రాయాలని, పోలింగ్ రోజున ఏవైన సమస్యలు ఎదురైనట్లయితే వెంటనే సెక్టోరల్ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. టెండర్ ఓట్లను పోలింగ్ ఆఫీసర్ గుర్తించి బిఎల్ఓల ద్వారా వివరాలు తెలుసుకొని టెండర్ ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఇవి జరగకుండా జాగ్రత్త పడాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ రోజు సాయంత్రం 4:45నిమిషాలకు పోలింగ్ ఆఫీసర్ బయటకు వచ్చి టైం అనౌన్స్ చేయాలన్నారు. ఇంకా ఓటు వేసేవారు ఉంటే క్యూ లైన్ వెనుక నుంచి సంతకంతో టోకెన్ ఇవ్వాలని తెలిపారు. ఓట్లు క్లియర్ అయ్యాక మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. సాయంత్రం 5గంటల తర్వాతనే క్లోజ్ బటన్ నొక్కాలని తెలిపారు. ప్రతి పోలింగ్ ఏజెంట్ కు 17సి ఫామ్ ఇవ్వాల్సి ఉంటుందని, ఎన్నికలు విజయవంతం చేసేలా పోలింగ్ అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ చీర్ల శ్రీనివాస్, ఎస్డిసి సుబ్రహ్మణ్యం, డిఆర్డిఓ నాగేంద్రం, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular