Sunday, June 29, 2025

స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కూడా నెట్టెంపాడు సాధించాను-బీజేపీ అభ్యర్థి శివారెడ్డి ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల నియోజకవర్గంలో తాను 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి గద్వాల నియోజకవర్గానికి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం సాధించడం వల్ల నేడు ప్రజలకు, రైతులకు పుష్కలంగా నీరంది సంతోషంగా ఉన్నారని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ డిమాండ్ చేశారు. మంగళవారం గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండలం, అల్వాలపాడు, కోతులగిద్ద, కొత్త పాలెం గ్రామాలలో బిజెపి గద్వాల నియోజకవర్గ అభ్యర్థి బోయ శివారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించగా, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ ప్రభుత్వం వస్తే జరిగే అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏమి అభివృద్ధి చేశారని, ప్రజలు వారికి ఓటు ఎందుకు వేయాలో తెలియజెప్పాలని అన్నారు. పదేళ్లుగా ఇస్తామన్న డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, వారికి ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఇంట్లో ఇద్దరు అర్హులు ఉన్నా పింఛన్ ఇవ్వలేదని అన్నారు. ముఖ్యంగా పదేళ్లయిన ప్రభుత్వ పాఠశాలలో ఒక టీచర్ పోస్టుని భర్తీ చేయలేదని, తెలంగాణలో చదువుని నిర్వీర్యం చేసి విద్యా వ్యవస్థను ఆగం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే గ్రామాల్లో వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, హరితహారం, సిసిరోడ్లు, వీధిలైట్లు వేశారని, కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. మండలానికి విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్ ఫార్మర్లు ఏర్పాటు చేసి కరెంటు లోవోల్టేజి సమస్య లేకుండా ఉండేందుకు నెట్టెంపాడు సాధించడం జరిగిందని, దాన్ని ద్వారానే ప్రజలకు కరెంట్, నీళ్లు పుష్కలంగా అంది పంటలు పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందారని అన్నారు. ఇదేళ్లు అధికార పార్టీలో ఉండి జెడ్పీ చైర్ పర్సన్ గా పదవి అనుభవించి ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని కాంగ్రెస్ పార్టీలో చేరింది ఎవరిని ఉద్ధరించడానికని ప్రశ్నించారు. అధికార పార్టీలో ఉన్నన్ని రోజులు గుర్తు రాని కుర్వ కులస్తులు ఇప్పుడు అధికారం కోసం గుర్తుకు రావడం హస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే వరి రైతులకు రూ. 3100ల మద్దతు ధర, సంవత్సరానికి 4సిలిండర్లు ఇస్తారని, మహిళ సంఘాలకు 10 పైసల వడ్డీకే రుణాలు ఇస్తారని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా కేంద్ర బీజేపీ ఆలోచించిందని అన్నారు. ఈ నెల 30న ఎన్నికల్లో బిజెపి పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బోయ శివారెడ్డిని కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిర్జాపురం రామచంద్రరెడ్డి, మండల అధ్యక్షుడు రాజేష్ అయ్య, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, మండల నాయకులు అల్లపాడు ప్రతాప్, హన్మంత రాయ, పాలెం నరసింహులు, సర్పంచు సురేష్, శేఖర్ రెడ్డి, నెట్టెంపాడు నరసింహులు, వేమా రెడ్డి, రాజు, ప్రభాకర్, వాల్మీకి నాయకులు వైండింగ్ రాములు, దాసు, శాలప్ప, సద్దల రాముడు, రాము, గోవిందమ్మ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular