జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో AIFB గద్వాల ఎమ్మెల్యే గొంగళ్ల రంజిత్ కుమార్ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా సోషల్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్,జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాజీ ఐఏఎస్. ఆకునూరి మురళి పాల్గొన్నారు. గద్వాల నియోజకవర్గంలో సింహం గుర్తు ద్వారా పోటీ చేస్తున్న AIFB ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు ఓటు వేయకుండా చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి దోపిడీ నడుస్తుందని అది చేస్తుంది కేవలం కేసీఆర్ కుటుంబమే అని అన్నారు. రాష్ట్రంలో 9 సంవత్సరాలు కొనసాగించిన పాలనలో ఎలాంటి అభివృద్ధిచేయకుండా నీరుగార్చారని,1200 మంది తెలంగాణ కోసం ఎంతోమంది అమరవీరులు ప్రాణత్యాగం చేశారని, అలాంటి కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదని కేవలం కేసీఆర్ కుటుంబమే పదవులు అనుభవించారని,విద్య,వైద్యం, అభివృద్ధి లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అసమర్థత పాలన కొనసాగుతోందని అన్నారు. బీజేపీలో ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి అవాస్ యోజనలో పేదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పిన కూడా ఇప్పటి వరకు కట్టించని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అలాంటి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయవద్దని కోరారు. గద్వాల నియోజకవర్గంలో నీతి, నిజాయితీతో పోరాటం చేస్తున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ AIFB ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్ పూర్తి మద్దతు తెల్పుతున్నామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గద్వాల నియోజకవర్గంలో గొంగళ్ల రంజిత్ పేద వర్గాల తరపున అనేక పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉండి, ఉద్యమం చేస్తున్నారని అలాంటి నిబద్ధత కల్గిన నాయకుడు గద్వాలలో పేద వర్గాల తరపున సింహం గుర్తుతో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్ ను అసెంబ్లీ పంపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా కార్యదర్శి లవన్న,ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు,కార్యదర్శి రాము మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు,కార్యదర్శి తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో అసమర్థత పాలన నడుస్తోంది.. ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES