జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బీఆర్. తిమ్మన్న తన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అభ్యర్థి బీఆర్. తిమ్మన్న మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన తనకు ఎన్నికల అధికారులు చపాతీ రోలర్ గుర్తుగా కేటాయించారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు తన చపాతీ రోలర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా చిత్తశుద్ధితో కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా తనకు ఈ ప్రాంత నాయకుల బెదిరింపులు, కేసులు కొత్త కాదని, ఇలాంటివి ఎన్ని వచ్చినా మీ అందరి అండతో ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తామని అన్నారు. ఇది వరకు తనపై గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 102/2019కింద కేసు నమోదు కాగా, సిసి నంబర్ 1383/2019 ప్రకారం గద్వాల జూనియర్ సివిల్ కోర్టులో కేసు విచారణలో ఉందని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థి బీఆర్. తిమ్మన్న ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES