జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్ పట్టణంలో
ఆదివారం జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను, పోలీస్ బందోబస్తు జిల్లా ఎస్పీ రితి రాజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శాంతినగర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న హెలిప్యాడ్ ప్రదేశాన్ని, సభ జరుగు ప్రదేశాన్ని ,
మీడియా గాలరీ, ప్రముఖుల గాలరీ, పబ్లిక్ గాలరీ ప్రదేశాలను, స్టేజి ప్రాంగణాన్ని పరిశీలించి పోలీస్ అధికారులకు,సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని, పబ్లిక్ వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వేంకటేశ్వర్లు, సాయుధ దళ డిఎస్పీ ఇమ్మనియోల్, శాంతి నగర్ సిఐ శివశంకర్, గద్వాల్ సిఐ శ్రీనివాస్, ఆర్.ఐ వెంకట్, శాంతినగర్ ఎస్సై నరేశ్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES