హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికల విధులకు సంబంధించిన వివిధ అంశాలపై మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హెచ్. ఎన్. గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిబంధనలు పాటిస్తూ మైక్రో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించాలన్నారు. ప్రతి మైక్రో అబ్జర్వర్ ఈనెల 29వ తేదీన రిపోర్ట్ చేయాలని అన్నారు. ఎన్నికలు జరిగే 30వ తేదీన ఉదయం ఐదున్నర గంటలకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు సరిగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకునేందుకు మాక్ పోలింగ్ ను నిర్వహించాలన్నారు. యాభై శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో మైక్రో ఆబ్జర్వర్లు ప్రతి అంశాన్ని గమనించాలన్నారు. పోలింగ్ రోజున సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే మైక్రో అబ్జర్వర్లు పరిశీలించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ కు రిపోర్ట్ చేయాలన్నారు. పోలింగ్ రోజున మైక్రో అబ్జర్వర్లు అందించే రిపోర్ట్ కీలకమన్నారు. ప్రజాస్వామ్య పండగ అయినా ఎన్నికల రోజున సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు. మైక్రో అబ్జర్వర్లకు 18 అంశాలకు సంబంధించిన ప్రొఫార్మను వివరించారు. సమర్ధవంతమైన పోలింగ్ నిర్వహణకు కృషి చేయాలన్నారు.పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున మైక్రో అబ్జర్వర్లు నిర్వర్తించాల్సిన విధులకు సంబంధించిన అంశాలను అధికారులు సమావేశంలో మైక్రో అబ్జర్వర్లకు వివరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ల పనితీరు గురించి మైక్రో అబ్జర్వర్లకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డిఈవో డాక్టర్ అబ్దుల్ హై, వరంగల్ పశ్చిమ, పరకాల, హుస్నాబాద్, హుజురాబాద్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్ పూర్, వర్దన్నపేట నియోజకవర్గాల మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.
ఎన్నికల విధి నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం.-ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES