జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా నగదు పంపిణీ, మద్యం, డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యక్రమాలు జరగుకుండా ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలు గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించాలని జిల్లా వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఏర్పాటైన ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాల పనితీరును జిల్లా వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝా పరిశీలించారు. బీచుపల్లి, అలంపూర్ చెక్ పోస్టుల దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ సర్విలెన్స్ టీమ్ బృందాలను ఆయన తనిఖీ చేశారు. అలాగే మానవపాడు, బొంకూరు దగ్గర ఫ్లైయింగ్ స్క్వార్డ్ బృందాల పనీతీరును పర్యవేక్షించారు. ఎన్నికల సమయంలో అక్రమ కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉండాలని అన్నారు. ఆయనతోపాటు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ ఉన్నారు.
ఎన్నికల్లో అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వొద్దు-ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝా ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES