Sunday, June 29, 2025

బీజేపీ సంకల్ప సభను జయప్రదం చేయాలి-బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 11గంటలకు నిర్వహించే బీజేపీ సంకల్ప సభకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ పిలుపునిచ్చారు. గద్వాల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బోయ శివారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నారని, ఈ సభ జిల్లా కేంద్రంలోని మెళ్లచెర్వు చౌరస్తా నందు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కావున బహిరంగ సభకు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ అభిమానులు, ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని డీకే. అరుణ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular