Sunday, June 29, 2025

వాహనాల తనిఖీల్లో రూ. 3లక్షల 10వేలు సీజ్-జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు 9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజ్ ఆదేశాల మేరకు గద్వాల పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో, సరిహద్దు చెక్ పోస్టులలో పోలీసు అధికారులు నిరంతరం వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గద్వాల పట్టణ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి రశీదులు లేకుండా తీసుకెళ్తున్న రూ. 2లక్షలను సీజ్ చేసి జిల్లా గ్రీవెన్స్ రిడ్రెసెల్ కమిటీకి అప్పగించగా వాటిని కమిటి విచారించి గురువారం సంబంధీకులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ రితిరాజ్ చెప్పారు. అలాగే గురువారం పట్టణ పోలీసులు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో కూడా ఎలాంటి రశీదులు లేకుండా తీసుకెళ్తున్న రూ. 3,10,000లను సీజ్ చేసి జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీకి అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా పరిధిలో ఎవరైనా రూ. 50వేలకు కొద్దిగా ఎక్కువ డబ్బులు ఉన్నా తీసుకువెళ్లరాదని, ఒకవేళ తీసుకెళ్తే తగిన రశీదులు, పత్రాలు, వాటి వివరాలు వెంట తీసుకెళ్ళాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular