Sunday, June 29, 2025

విద్యార్థులు బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాల సదన్ భవనంలో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుంటే మంచి బవిష్యతు ఉంటుందని, చదువును అశ్రద్ధ చేయకుండా అందరు బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి అన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ చక్కగా చదివి విద్యలో ముందంజలో ఉండాలన్నారు. విద్యార్థులకు చదువే ఆయుధమని ప్రతి విద్యార్థి చదువులో రాణించాలన్నారు. బాల్యం నుండే చదువులో రాణించాలని, చదువు పట్ల నిరక్ష్యం వహించకుండా బాగా చదువుకుంటే బవిష్యత్ లో మీ కాళపై మీరు నిలబడ గల్గుతారని అన్నారు. పోటీలలో పాల్గొని గెలుపొందిన వారికీ బహుమతులు అందజేశారు. పిల్లలతో కేక్ కట్ చేయించి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్, శిశు సంక్షేమ అధికారి ముసాయిదా బేగం, సిడబ్ల్యుసి చైర్మన్ సహదేవుడు, సిడబ్ల్యుసి మెంబర్, నరసింహ, సిబంది, బాలికలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular