Sunday, June 29, 2025

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి-సాధారణ ఎన్నికల పరిశీలకులు వసంత కుమార్ … ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరు సహకరించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు పి. వసంత కుమార్ అన్నారు. మంగళవారం ఐడిఓసి కాన్ఫరెన్సు హాలు నందు పోలీసు పరిశీలకులు అనుపం శర్మ, వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝా లతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. రాజకీయ పార్టీలు ముందస్తుగా సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకొని సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఈ సువిధ యాప్ 24గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ఏ సమస్య వచ్చినా జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా నగదు పట్టుపడితే అట్టి సమాచారం వెంటనే గ్రీవెన్స్ కమిటీకి తెలపాలన్నారు. అనంతరం పోలీసు పరిశీలకులు అనుపం శర్మ మాట్లాడుతూ ఎన్నికల ప్రభావిత అంశం ఏదైనా ప్రజల దృష్టికి, పార్టీ నాయకుల దృష్టికి వస్తే తన మొబైల్ నెంబర్ 6301754688కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏదైనా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుకై గద్వాల, అలంపూర్ నియోజయకవర్గాల వారిగా నేరుగా తనని పదవ బెటాలియన్ ఎర్రవల్లి నందు ఉదయం10 నుంచి 11గంటల వరకు సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, జిల్లా భౌగోళిక పరిస్థితులు, రాష్ట్ర సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక చర్యలు తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వనరబుల్ పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. అలాగే వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝా మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఖర్చు రూ. 40లక్షలకు మించకుండా ఉండాలని తెలిపారు. అభ్యర్థి తన ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేకంగా ప్రాపర్ బ్యాంక్ అకౌంటును, అభ్యర్థి తన ఎన్నికల ఖర్చును ఒక రిజిష్టరులో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular