జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గ పరిధిలోని గట్టు మండలం, బోయాల గూడెంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బలపరిచిన గద్వాల నియోజకవర్గం బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలిగేర బోయ శివారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా బోయలగూడెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ మాట్లాడుతూ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బహుజన బడుగు బలహీన వర్గాల బిడ్డగా మీ ఊరికి వచ్చిన బిజెపి పార్టీ అభ్యర్థి శివారెడ్డి గెలుపు కోసం కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని గ్రామస్తులను అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ లక్షల కోట్లు అప్పుల కూపంలో నెట్టేశాడని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ మొత్తాన్ని అమ్మేస్తాడని తెలిపారు. రాజకీయాల్లోకి తాను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను కానీ, వీళ్ళలాగా భూ కబ్జాలు, మట్టి మాఫియా, ఓట్లు దోచుకోవడానికి రాలేదని అన్నారు. గద్వాల పట్టణంలోని ప్లాట్లు గుంజుకుంటే ఎప్పుడైనా ప్రశ్నించారా అని నిలదీశారు. తాను ప్రతిపక్షంలో ఉండి కూడా గద్వాల జిల్లాను సాధించామని, పాదయాత్రతో నెట్టెంపాడు సాధించడంతో నేడు ప్రజలు పంటలు పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందారని అన్నారు. పాఠశాల భవనాలు, పంచాయతీ భవనాలు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, హాస్టల్ ఇలా అనేక రకాలుగా అభివృద్ధి చేశామని అన్నారు. బంగ్లా ఎప్పటికీ పేద వాళ్ళ బంగ్లా అని, కష్టం వచ్చిన వాళ్లకు అర్ధరాత్రి ఆయిన ఆదుకునేది బంగ్లానే అని, దాన్ని కూల్చే దమ్ము, శక్తి కానీ ఎవరికి లేదన్నారు. గద్వాలలో బిజెపి పార్టీ అభ్యర్థి బీసీ వాల్మీకి బోయ శివారెడ్డిని నిలబెట్టినందుకు ప్రజలను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇక్కడికి మాట్లాడుతున్నారని అన్నారు. వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీదేనని పేర్కొన్నారు. ఇక్కడ వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ శివారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయని వారు కులాల పేరుతో రాజకీయం చేస్తున్నారని, గతంలో అధికార పార్టీలో ఉండి అభివృద్ధి చేయనివారు ఈసారి గెలిచి ఎలా అభివృద్ధి చేస్తారని అన్నారు. భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని, ఈ ప్రాంతంలో బిసి వాల్మీకి నాయకున్నీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆకర్షతులై యువత భారీగా బిజెపి పార్టీ లో చేరుతున్నారని తెలిపారు. కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వమే వస్తుందని, ఈ సారి తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు హామీలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. బిఆర్ఎస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని, రాబోయే ఎన్నికలలో గద్వాలలో ఖచ్చితంగా బిజెపి జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మధుసూదనయ్య, నందిన్నే ప్రకాష్ రావు,వాల్మీకి నాయకులు టి రామాంజనేయులు,వైన్డింగ్ రాములు,వీరబాబు,దాసు, శాలప్ప,తదితరులు ఉన్నారు.
గట్టు మండలంలో ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ అభ్యర్థి-మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES