జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న సాధారణ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని బృందాలు కలిసికట్టుగా కృషి చేయాలని ఎన్నికల సాదారణ పరిశీలకులు పి. వసంతకుమార్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం జిల్లాకు నియమించిన సాదారణ పరిశీలకులు సోమవారం ఐడిఓసి కార్యాలయానికి చేరుకోగా వారికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్(ఎల్ బీ) అపుర్వ్ చౌహాన్ పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పరిశీలకులు సి-విజిల్, కంట్రోల్ రూమ్, ఎంసిఎంసి, మీడియా సెంటర్ ను పరిశీలించారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకులకు కలెక్టర్ వివరించారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అలాగే గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సి-విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సి విజిల్ 58 , టోల్ ఫ్రీ నంబర్ కు 796 కాల్స్ రిసీవ్ చేసుకొని ఫిర్యాదు చేసిన వాటిని నమోదు చేసుకుని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇవిఎంల మొదటి రాండమైజేషన్ నిర్వహించి నియోజక వర్గం వారిగా పంపించడం జరిగిందని తెలిపారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాలలో ఎస్ఎస్టి, ఎఫ్ఎస్టి, విఎస్ టి బృందాలను ఏర్పాటు చేసి 24గంటలు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఐదు చెక్పోస్టుల ద్వారా నిఘా ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, తనిఖీలు కూడా ముమ్మరం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా తరలించే మద్యం, నగదుపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఎంసీఏంసి మానిటరింగ్ కమిటీ గురించి ఏర్పాటు చేసిన కార్యాలయంలో వారు తనిఖీ చేశారు. ఎంసిఎంసి ద్వారా ఎన్నికలలో ప్రకటనలు జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సర్టిఫికేషన్ చేయనున్నట్లు ఎన్నికల సంఘం విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయం నమోదు చేయడం జరుగుతుందన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల స్కృటినీ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు పాల్గొని కార్యక్రమ్మాన్ని పరిశీలించారు. అనంతరం జనరల్ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల ప్రభావిత అంశం ఏదైనా ప్రజల దృష్టికి, పార్టీ నాయకుల దృష్టికి వస్తే తన మొబైల్ నెంబర్ 6300332716కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏదైనా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుకై నేరుగా తనని జూరాల నందు ఉన్న జెన్కో అతిథి గృహంలో సంప్రదించవచ్చని, అలంపూర్ నియోజకవర్గం అయితే ఉదయం10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, గద్వాల నియోజకవర్గం అయితే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తనను సంప్రదించవచ్చని సాధారణ పరిశీలకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ భద్రప్ప, ఎంసిఎంసి నోడల్ ఆఫీసర్ చెన్నమ్మ, సి విజిల్ యాప్ నోడల అధికారి ప్రియాంక తదితరులు ఉన్నారు.
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి-ఎన్నికల పరిశీలకులు వసంత కుమార్-ఎన్నికల పరిశీలకులకు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES