జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సాధారణ ఎన్నికల సందర్బంగా ఓటు హక్కు వినియోగంపై ప్రజలలో పూర్తి అవగాహన కల్పించేందుకు స్వీప్ కార్యక్రమాలలో భాగంగా గద్వాలలోని రాజీవ్ మార్గ్ లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ మోడళ్లను కలెక్టర్ ప్రారంభించారు. ఐడిఓసి కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన “ఐ ఓటు ఫర్ సూర్” అనే సెల్ఫీ పాయింటును అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహాన్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఓటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వజ్రాయుధమని ఓటు వేయడం ద్వారా మంచి ప్రతినిధిని ఎన్నుకోవచ్చని తెలిపారు. ఓటు హక్కు ప్రాధాన్యత ప్రతి ఒక్కరు తెలుసు కోవాలని, ఎన్నికల్లో ఎలాంటి ధన, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్చాయుతంగా ఓటును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, స్వీప్ నోడల్ అధికారి రమేష్ బాబు, డిపిఆర్ఓ చెన్నమ్మ, తహసీల్దార్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES