Saturday, June 28, 2025

ఎన్నికల వేళ సరిహద్దులో గట్టి నిఘా- ఎక్సైజ్ శాఖ అధికారి సైదులు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లో ఎన్నికల వేల గట్టి నిఘా ఉంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎక్సైజ్ శాఖ అధికారి సైదులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచూరు, గద్వాల సరిహద్దు నందిన్నె దగ్గర ముగ్గుర ఎస్సైలు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లతో సరిహద్దు నిఘా బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఎక్సైజ్ శాఖ అధికారి తెలిపారు. ఈ బృందంలో ఉన్న అందరు సిబ్బంది 24గంటలు తనిఖీలు నిర్వహిస్తారని కర్ణాటక మద్యం వాహనాల్లో తరలిస్తూ పట్టుబడితే కేసులు పెట్టి వాహనాలు సీజ్ చేస్తామని 5 సంవత్సరాలు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా పడే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర మధ్య వాహనాలలో పరిమితికి మించి ఉండి పట్టుబడిన వారి మీద కూడా కేసులు నమోదు చేస్తామని అన్నారు. పరిమితికి మించి నగదు ఉన్న వాటికి సంబంధించిన వివరాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఇవే కాక సర్వేలెన్స్ టీమ్ నిరంతరం జిల్లా వ్యాప్తంగా 24గంటలు తనిఖీలు నిర్వహిస్తుందని జిల్లా ప్రజలందరు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular