జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. గద్వాల పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం ఆవరణలో ఈ కంటి వైద్య శిబిరాన్ని అధ్యక్షులు బాలకిషన్ రావ్ ప్రారంభించగా 52మంది కంటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో కంటి ఆపరేషన్ నిమిత్తం12మందిని హైదరాబాదులోని మెడివిజన్ ఆసుపత్రికి ఉచితంగా కంటి చికిత్సలు నిర్వహించేందుకు పంపనున్నట్లు బాలకిషన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడివిజన్ హాస్పిటల్ వైద్య బృందం, సంఘ నాయకులు చక్రధర్, బీసీరెడ్డి, హనుమంతు, వెంకట
