
గద్వాల నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 7న మంగళవారం మధ్యాహ్నం 2:00 గంటలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల నియోజకవర్గంలో గద్వాల ప్రజా గర్జన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అని గద్వాల అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి సరిత మ్మా విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు చెప్పారు. గద్వాల పట్టణ సమీపంలోని మేళ్లచెరువు క్రాస్ రోడ్ దగ్గర ఈ ఈ సభ ఉంటుందని ఆమె తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి వేలాదిమంది కార్యకర్తలు కదిలి వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ సదా గౌడ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంజిపేట్ శంకర్,మధుసూదన్ బాబు,ఓబిసి అధ్యక్షుడు నల్లారెడ్డి, ఇషాక్,లత్తిపురం వెంకట్రామిరెడ్డి, గంజిపేట్ తిమ్మన్న,దినేష్, అచ్చన్న గౌడ్, ఆనంద్,కరాటే సత్యం, జమల్ తదితరులు ఉన్నారు.