జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు నేషనల్ టీవీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లో పోలింగ్ రోజు సాధారణ ఎన్నికలలో వినియోగించే ఈవీఎంలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పిఓ, ఏపిఓ, ఓపిఓలకు ఆదేశించారు. సోమవారం ఉదయం ఎంఏఎల్డి కళాశాలలో పిఓ, ఏపిఓ, ఓపిఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమాల్లో శిక్షణ పొందిన పిఓ, ఏపిఓలు పోలింగ్ బూత్ లలో సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని హితవుపలికారు. శిక్షణ తరగతులను అర్థం చేసుకుని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణమైన అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈవీఎంల కనెక్ట్ నుంచి వాటిని వాడే విధానంపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ నాడు ఉదయం 6గంటలకు మాక్ పోల్ నిర్వహించి క్లోజ్ రిజల్ట్ క్లియర్ బటన్ (సిఆర్సి) అయ్యే దాకా పరిశీలించి తదుపరి పోలింగ్ మొదలు పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరు ఫారం-12 పిలప్ చేసి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఓ, ఏపీఓ, ఒపిఓలు మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.
