ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి: Kuc పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చింతగట్టు orr వద్ద తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి వరంగల్ పోలీస్ కమీషనర్ అయిన అంబర్ కిషోర్ ఆదేశాలమేరకు సెంట్రల్ జోన్ DCP M.A భారీ నేతృత్వంలో హన్మకొండ ACP కిరణ్ కుమార్ TASK FORCE ACP మధుసూదన్ ఆధ్వర్యంలో kuc పోలీస్ మరియు task force వారు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలో భాగంగా చేస్తున్న క్రమంలో మహారాష్ట్రకు చెందిన ఒక కార్ MH46AL3845 మరియు దానితో పాటు AP09BS3888అను దానిని పరిశీలించడం కోసం ఆపమనగా ఆ కార్ల ను నడుపుతున్న వ్యక్తులు ఆపకుండా వెళ్లడంతో అనుమానం వచ్చి వెంబడించగా అందులోనుండి కొందరు వ్యక్తులు పారిపోగా మిగిలిన వ్యక్తులను పట్టుకొనగా వారు ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నారని అడుగగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీస్ వారు వాహనాలను తనిఖీ చేయగా అందులో కొన్ని నోట్ల కట్టలు లభించడంతో వాటిని పరిశీలించగా అవి కొన్ని నకిలీ నోట్ల కట్టలని కొన్ని అసలైనవని తెలింది.

వెంటనే వారిని పట్టుకుని పంచుల సమక్షంలో విచారించగా వారు పోరిక రాజ్ కుమార్ R/లో ములుగు ఘనపూర్ మరియు అతనికి తెలిసిన బూర శ్రీకాంత్, రాజేష్ మరియు మంతెన కావ్య నలుగురు ముఠా గా ఏర్పడి నకిలీ నోట్ల వ్యాపారం చేస్తు అందులో భాగంగా ఎవరైనా కావాలంటే నేను నిజమైన నోట్లను వారి వద్దనుండి తీసుకుని వాటికి రెండింతల మొత్తం నకిలీ కరెన్సీ ఇచ్చి భహిరంగ మార్కెట్ లో చెలామణి చెయ్యమని చెప్తారు . ఈవిధంగా పోరిక రాజ్ కుమార్ గతంలో చాలాసార్లు చేసి జైలుకి కూడా వెళ్లి వచ్చిన అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈక్రమంలో రాజ్ కుమార్ కు నాందెడ్ కు చెందిన పఠాన్ @హుస్సేన్ అను వ్యక్తిని పరిచయం చేసుకుని ఎవరికైనా నకిలీ నోట్లు కావాలంటే ఇస్తానని అలాంటి వాళ్ళని నా దగ్గరికి పంపితే వచ్చిన లాభం నుండి సగం ఇస్తానని చెప్పడం తో పఠాన్ తనకి తెలిసిన వాళ్లకి నకిలీ నోట్లు కావాలని వారికి ఇవ్వమని చెప్పడంతో వారిని హన్మకొండ రమ్మని చెప్పాడు.
దాంతో పఠాన్ అతనికి తెలిసిన వ్యక్తులు అయిన ఓంకార్ విశ్వనాథరావు బూరే,మరియు విష్ణు కవాల్ అను వ్యక్తులు పఠాన్ ను అడగడంతో వారిని హన్మకొండ వెళ్లి నకిలీ నోట్లు తీసుకోమని చెప్పగా వారు నాందేడ్ నుండి ఇక్కడకి వారి డ్రైవర్ అయిన దొండ్జి సంబాజీ తో కలిసి హన్మకొండ లోని మయూరి లోడ్జి పక్కనే ఉన్న సతీష్ లాడ్జి లోకి రాగ పోరిక రాజకుమార్ వెళ్లి వారిని కలిసి మీరు నాకు రెండు లక్షలు అసలు నగదు ఇస్తే మీకు 4లక్షల నకిలీ నోట్లు ఇస్తానని చెప్పి వారిని డబ్బులు తీసుకుని హన్మకొండ లోని పబ్లిక్ గార్డెన్స్ వద్దకు రమ్మనగా వారు అక్కడ మీరు అసలు నోట్లు ఇస్తే మీకు నకిలీ నోట్లు ఇస్తాను అని చెప్పాడు. వారు రెండు లక్షలు ఇవ్వగా అందులోనుండి లక్ష రూపాయలు పఠాన్ కు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసారు.
మిగిలిన వాటిలో బూర శ్రీకాంత్ 10వేలు మరియు కావ్యకు 5వేలు ఇచ్చి అతను అక్కడ సమీపంలో ఉన్న బుక్ స్టాల్ వద్దకు వెళ్లి spicemen కరెన్సీ తీసుకొని నల్లని పేపర్స్ తీసుకొని వాటిని 500రూపాయల నోటు అంత కట్ చేసిన నలుపు రంగు పూసిన నోట్లు ఇచ్చి ఇవి మీరు ఇంటికి తీసుకుని వెళ్లి hypo ద్రావణం నందు కడిగితే అవి 500నకిలీ నోట్లు మారతాయని చెప్పగా వారు 4లక్షలు నకిలీ నోట్లు తీసుకొని పోరిక రాజ్ కుమార్ ను అతనితో పాటు ఉన్న వ్యక్తులను హన్మకొండ దాటించేవరకు వారికి తోడు రమ్మనగా వాటిని తీసుకొని వెళ్తుండగా చింతగట్టు బ్రిడ్జి వద్ద పోలీస్ వారు పట్టుకున్నారు

.ఇందులో పోరిక రాజ్ కుమార్,ఓంకార్ విశ్వనాథరావు బూరే,మరియు విష్ణు కవాల్ మరియు దొండ్జి సంబాజీ దొరికగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది.రాజేష్, బూర శ్రీకాంత్ మరియు మంతే కావ్య అక్కడ నుంచి పారిపోవడం జరిగినది. దొరికిన వ్యక్తుల వద్ద నుండి 85,000/- రూపాయలు విలువ గల నిజమైన 500రూపాయలు నోట్లు, 4లక్షలు నకిలీ 500 కరెన్సీ మరియు 2 కార్లు 5సెల్ ఫోన్లు మరియు నకిలీ కరెన్సీ తయారు చేయుటకు కావాల్సిన సామాగ్రి స్వాదినం చేసుకున్నారు.
నిందితులను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరిచినటువంటి కేయూసీ పోలీసు వారిని మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమీషనర్ అయినా అంబర్ కిషోర్ జా గారు అభినందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో kuc ఇన్స్పెక్టర్ అబ్బయ్య గారు మరియు ఎస్సై సురేష్, అనిల్, రాజ్ కుమార్ మరియు సిబ్బంది,టాస్క్ ఫోర్స్ సిఐ రాంబాబు, ఎస్ఐ శరత్ మరియు సిబ్బంది అశోక్,సాంబరాజు, సత్యనారాయణ పాల్గొన్నారు.