ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన మహిళ ఉద్యోగినులు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తీరోక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగినులు వారి పిల్లలు ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ వేడుకలు మహిళల ఆటపాటల మధ్య కన్నుల పండుగగా ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్త పట్నాయక్ మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో మహిళల్ని శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనదని పేర్కొన్నారు.పువ్వులను దేవతలుగా పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు.అలాంటి గొప్ప పండుగను మన కలెక్టరేట్లో ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఉద్యోగి ఉద్యోగులను ప్రజలను చైతన్యపరిచి ఓటింగ్ శాతాన్ని పెంచుటకు కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి బయనికి లోను కాకుండా ఓటు వేయాలని అన్నారు .మహిళా ఉద్యోగులు వారు వారి ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించేలా చూడాలని తెలిపుతూ ఓటు హక్కు అనేది మన చేతిలో ఉన్న వజ్రాయుధం. కావున ప్రతీ పౌరుడు 18 సం. లు నిండిన యువతీ, యువకులు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. స్వీప్ అధ్వర్యంలో అటల, పోటీలు నిర్వహించి గెలిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు.
ట్రైన్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు ఆకవరపు శ్రీనివాస కుమార్,జిల్లా నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు ఆకుల రాజేందర్,జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు అన్నమనేని జగన్ మోహన్ రావులు మాట్లాడుతూ ఉద్యోగ సోదరీమణులందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ జిల్లాలోని ఉద్యోగులందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉత్తమంగా పేర్చిన బతుకమ్మలకు అతిథులు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి. డి అర్ డి ఎ శాఖకు లభించినది .బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న అన్ని శాఖల వారికి షీల్డ్ లను బహుకరించారు.