Saturday, June 28, 2025

💥అత్తను రివాల్వర్ తో కాల్చి చంపిన కానిస్టేబుల్💥🔫-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి వరంగల్ : అత్తకు 4 లక్షల రూపాయల అప్పు ఇచ్చిన కానిస్టేబుల్ ప్రసాద్ తిరిగి ఇవ్వమని అడగడంతో ఇవ్వకపోవడంతో అతను రివాల్వర్ తో కాల్చి చంపాడు… రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు ప్రసాద్హనుమకొండ జిల్లాలోని గుండ్ల సింగారంలో అత్తను అల్లుడు కాల్చి చంపాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కానిస్టేబుల్ ప్రసాద్ తన అత్తను తుపాకీతో కాల్చి చంపాడు.కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో ప్రసాద్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. తన కాపురంలో అత్త చిచ్చు పెడుతుందనే అనుమానంతోనే ఆమెను అల్లుడు హత్య చేసినట్టు సమాచారం.గత కొన్ని రోజులగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దంపతుల మధ్య అత్త గొడవ పెడుతుందని పలుమార్లు ఆమెపై అల్లుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular