ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: కలెక్టర్ సిక్త పట్నాయక్ సమీకృత జిల్లా కార్యాలయాల భవనం లోని గ్రీవెన్స్ హాల్ పక్కన గల హాల్ లో (G36)ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ , మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎం.సీ.ఎం.సీ) ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికపుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కు అందించాలని సూచించారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
MCMC కమిటీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ , ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలకు వంటివి సకాలంలో ఆమోదం మంజూరు చేయాలని అన్నారు. షాటిలైట్ ఛానెల్ లో వచ్చే వార్తలను పూర్తి స్థాయిలో రికార్డు చేయాలి అని సూచించారు.
వార్తా పత్రికలు, ఈ-పేపర్లు, టెలివిజన్ ఛానెల్లు, స్థానిక కేబుల్ నెట్వర్క్లు, సోషల్ మీడియా, మూవీ హౌస్లు మరియు SMSలు మరియు ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను MCMC నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
సోషల్ మీడియా లో వచ్చే పోస్టుల పై ప్రత్యేక ద్రుష్టి సారించాలని,
ఎన్నికల ప్రవర్తన నియామవాళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని స్పష్టం చేసారు.ఎన్నికల సంబంధిత పిర్యాదు ల కొరకు కంట్రోల్ రూమ్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1816 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుంది అని అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి మీడియా ది కీలక పాత్ర అని, ఎన్నికలకు సంబందించిన ఎటువంటి సమాచారం అయినా అధికారుల ద్రుష్టి కి తీసుకొని రావాలి అని తెలిపారు.ఈ కార్యక్రమం లో dpro లక్ష్మణ్ కుమార్ De భూపాల్,అరుణ ఎన్నికల సిబ్బంది,సోషల్ మీడియా సిబ్బంది, జర్నలిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.