ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:హనుమకొండ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్త పట్నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగ రాజకీయ పార్టీ ప్రతినిధుల తో కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ఫిర్యాదులు, అనుమతులు, నామినేషన్ ప్రక్రియలను సులభతరం చేసేలా సీ-విజిల్, ఈ-సువిధ యాప్ లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఈ- సువిద యాప్ ద్వారా పార్టీ సమావేశాలకు సంబంధించి ముందస్తు అనుమతులను పొందవచ్చిని, అదే విధంగా నామినేషన్ కూడా ఈ-సువిద యాప్ ద్వారా వేసే అవకాశాన్ని ఎన్నికల కమీషన్ కల్పించదని అన్నారు. పొలిటికల్ పార్టీలకు చెందిన వారు వారి బూత్ స్థాయి ఎజెంట్ల వివరాలను సమర్పించాలని కోరారు. ప్రచారాలను ఎప్పటికప్పుడు కమిటిల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలు వారిద్వారా పోలిటికల్ పార్టీలకు సంబంధించిన పోస్టర్ నుండి పాంప్లెట్ వరకు ప్రింటింగ్ చేసే ప్రతిదానిపై ప్రెస్ పేరు, సెల్ ఫోన్ మరియు వివరాలను తప్పక అచ్చువేయాలని, ఆ దిశగా స్పష్టమైన ఆదేశాలను ప్రింటింగ్ ప్రెస్ లకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో విధ్యూత్, మంచినీరు, టాయిలెట్, షామియాన, వికలాంగుల కొరకు ర్యాంపులు వీల్ చైర్ మొదలగు మౌళిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ ఆస్తులపై వాల్ రైటింగ్, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్లు తదితరాలన్ని 24 గంటల లోపు, అన్ని పబ్లిక్ స్థలాల్లో ఉన్న వాటిని 48 గంటల్లో, ప్రయివేటులో ఉన్న వాటిని 72 గంటల లోపు తొలగించాలని ఆయన తెలిపారు. వెబ్సైట్ లో రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించాలన్నారు. ప్రభుత్వ వాహనాలు రాజకీయ అవసరాలకు వాడరాదన్నారు