ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:రాష్ట్ర శాసన సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సీపీ రంగనాధ్, హనుమకొండ కలెక్టర్ సిక్త పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య జనగామ్ కలెక్టర్ శివలింగయ్య లు సంయుక్తం గా సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సోమవారంనుండే అమలులోకి వచ్చిందని, డిసెంబర్ 5వ తేదీ వరకు కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు.. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున అనుమతులు లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిర్వహించాల్సివస్తే తప్పనిసరిగా ముందస్తుగా లిఖిత పూర్వకంగా అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారుల నుండి అనుమతులు పొందాలని సూచించారు. ఇప్పటి నుండి ఎంసిఎంసి, సోషల్ మీడియా బృందాలు పనిచేస్తాయని వివరించారు. నవంబర్ 3వ తేదీ నుండి ఎన్నికల వ్యయ పరిశీలకుల బృందాలు ఏర్నాలు అవుతాయని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై సంబంధిత చట్టాలను అనుసరిస్తూ కేసులు నమోదు చేస్తామని అన్నారు కోడ్ ఉల్లంఘన గురించి ప్రజలు నేరుగా 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని, అలాగే ఈసారి కొత్తగా సీ-విజిల్ యాప్ ను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో తెచ్చిందన్నారు. ఈ యాప్ ద్వారా కోడ్ ఉల్లంఘన అంశాలు లైవ్ ఫోటోలు, వీడియోలు తీసి ఈ.సీ దృష్టికి తేవచ్చని సూచించారు.
సమస్యాత్మక కేంద్రాలలో పోలీసు బందోబస్త్ తో పాటు మైక్రో అబ్జర్వర్స్ పరిశీలిస్తారని తెలిపారు. జిల్లా పరిహద్దుల్లో చెక్క్ పోస్టులు ప్లైయింగ్ స్కాడ్ బృందాలు పనిచేస్తాయని తెలిపారు. జిల్లాలో సార్వతిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుటకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించామని, నోడల్ అధికారులను, సర్వేలెన్స్, ప్లైయింగ్ స్కాడ్స్, సిబ్బందిని నియమించామని తెలిపారు. అధికారులకు కేటాయించిన విధులపై ఇప్పకే పలుధపాలు శిక్షణ, సమావేశాలు నిర్వహించామని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మతం, కులం ,ప్రాంతం పై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం బెదిరింపులకు చేయడం తప్పుడు ప్రచారాలు చేయడం పై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.