ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: బి ఆర్ ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఈరోజు హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ హాజరై మాట్లాడుతూ ఈనెల ఆరవ తేదీన కూడా గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు ప్రతి డివిజన్ నుండి బిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. 50 వేల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి మరియు బిఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్న నేపథ్యంలో సుమారు రూ.900 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని అన్నారు.తదుపరి భారీ బహిరంగ సభకు హాజరవుతారని ఆ సభను పార్టీ శ్రేణులంతా క్రమశిక్షణతో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, పచ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు వివిధ విభాగాలకు చెందినటువంటి ముఖ్యులు అందరూ కూడా హాజరయ్యారు.
