Friday, June 27, 2025

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల.-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: రేపు హన్మకొండ లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్బంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల,

వరంగల్ కు వస్తున్న కేటీఆర్ దమ్ముంటే కాకతీయ యూనివర్సిటీలో పర్యటించాలి.

వరంగల్ కు మోడీ ఏం ఇచ్చారో, మీరేం ఇచ్చారో తేల్చుకునేందుకు చర్చకు సిద్ధమా?

మీ ఎమ్మెల్యే లు చర్చ అంటే పారిపోతున్నారు. మున్సిపల్ మంత్రిగా మీరైనా సిద్ధమా?

ఈ సారైనా ఇళ్ళ పట్టాలు పూర్తిగా ఇవ్వాలి.

బాలసముద్రం దగ్గర కట్టి సిద్ధంగా ఉన్న ఆ కొన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లైనా అర్హులైన పేదలకు పంపిణీ చెయ్యాలి.

గతంలో వరంగల్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పై 30 ప్రశ్నలు సంధిస్తే ఇప్పటివరకు ఒక్కదానికే కేటీఆర్ నుండి సమాధానం రాలేదని, వచ్చినప్పుడల్లా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు తప్పా ఓరుగల్లును పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపడం లేదని అన్నారు.

🔹మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ తన శాఖ పరిధిలోకి వచ్చే సమస్యలకు సమాధానం చెప్పడానికి కూడా తీరిక దొరకడం లేదని అన్నారు.

🔹పది లక్షల మంది నివసించే వరంగల్ కు ఒక డంపింగ్ యార్డ్ సరిగ్గా లేదు.

🔹ఇంకా 50 ఏళ్ల నాటి మాస్టర్ ప్లాన్ నే వాడుతున్నారు.

🔹కనీసం ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కానీ, తన శాఖ పరిధిలోని ఈ సమస్యలన్నీ గాలికి వదిలేసి తన గొప్పలు, వాళ్ల నాన్న గొప్పలు చెప్పుకుంటూ గప్పాలు కొట్టుకుంటూ పర్యటనలు చేస్తున్నారని. ఈయనను మున్సిపల్ మంత్రిగా కంటే జిల్లాల పర్యాటక మంత్రి, ఇంగ్లీష్ టూటర్ మంత్రి అంటే బాగుంటుందని విమర్శించారు.

నిన్న ప్రధాని మోడీని టార్గెట్ గా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, కేటీఆర్ ను విమర్శించారు.

🔹మోసగాళ్లు అని ఎవరు ఎవర్ని అంటున్నారు. పాస్‌పోర్ట్ లో మోసం చేసారు ఎవరు? మొన్న tspsc లో మోసం చేసింది ఎవరు? అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన హామీల పై ఎవరు మోసం చేశారు?

🔹మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని అవి చేస్తాం ఇవి చేస్తామని మోసం చేస్తుంది ఎవరూ? నిజంగా కెసిఆర్ అంత ఫైటర్ అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ను ఎందుకు తీసుకున్నారు? అంత ఫైటర్ అయితే ఢిల్లీ వెళ్లి మరీ NDA లో కలుస్తాం అని ఎందుకు అన్నారు .

🔹మోడీ గారు చుట్టం చూపుగా వచ్చారని అంటున్న కేటీఆర్. మరి ముఖ్య మంత్రి కేసీఆర్ గారు ఎక్కడనే ఉండి ప్రజలను ఈ మాత్రం చూస్తున్నారు.

🔹ప్రజలు,నిరుద్యోగులు చస్తుంటే కనీసం చివరి చూపు కూడా చూడట్లే. మీ చూపు వ్యాపారాల పైనా, కమిషన్లు పైన మాత్రమే కదా.
🔹ఇక్కడ జరిగి అభివృద్ధి గురించి ప్రధాని మాట్లాడడం లేదు అని కేటీఆర్ గారు అన్నారు. అవును ఇంకా అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ జరుగుతూంది. కాబట్టి అవినీతి గురించి ప్రధాని మాట్లాడుతున్నారు.

ప్రధాని స్వయంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు దాని సాక్షం మొన్న 13,000 అభివృద్ధి పనులు , నిన్న 8000 కోట్లు పనులు ప్రారంభించారు .
🔹మోడీవి అని అబ్బదాలు అంటున్నాడు. ఏది అబద్ధం కాళేశ్వరం పూర్తి అవినీతి మయం ఇది అబద్దమా?
లక్ష ఉద్యోగాల హామీ మీ అబద్ధం కాదా?
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ హామీ మీ అబద్ధం కాదా.
రైతులకు లక్ష రుణ మాఫీ మీ అబద్ధం కాదా. ఇలా మీరు అన్ని అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేస్తూ మమ్మల్ని అబద్ధం అబడటం హాస్యాస్పదంగా ఉంది. అని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular