ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) సెప్టెంబర్ 30న వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచినట్లు వర్గాలు తెలిపాయి. పెంచిన 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధర రూ.209 ఈ రోజు నుంచి అమలులోకి రానున్నాయి. ఈ పెరుగుదల తర్వాత, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకాల ధర రూ.1731.50గా ఉంటుందని పలు నివేదికలు తెలిపాయి.
ఈ నెల ప్రారంభంలో, కేంద్ర మంత్రివర్గం ఉజ్వల పథకం కింద అదనంగా 75 లక్షల కొత్త ఎల్పీజీ కనెక్షన్లను ఆమోదించింది. ఇది వచ్చే మూడేళ్లలో ఇవ్వబడుతుంది. ఈ కనెక్షన్లపై మొత్తం వ్యయం రూ.1,650 కోట్లు. ఉజ్వల పథకం కింద అందిస్తోన్న డిపాజిట్-రహిత కనెక్షన్ల కొనసాగింపుగా ఈ కొత్త కనెక్షన్లు ఉంటాయని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.