Friday, May 2, 2025

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు క్యూ…

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామిని దర్శించుకోవడానికి బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనానికి 3గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. లడ్డు ప్రసాదం కౌంటర్లు, కల్యాణ కట్ట వద్ద కూడా భక్తుల కోలాహలం నెలకొంది.

భక్తుల రద్దీని ముందే ఊహించిన ఆలయ సిబ్బంది భక్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular