ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: బీజేపీ చేసేది లేదు…కాంగ్రెస్ గెలిచేది లేదన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ పాలన అంటేనే కష్టాలు, కన్నీళ్లేనన్నారు. నరేంద్ర మోదీ తెలంగాణకు వొచ్చి జాకీలు పెట్టి లేపినా బీజేపీకి డిపాజిట్ రాదన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో రాబోతుందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు హరీశ్ రావు.
రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. కేంద్రం సహకరించకున్నా… అభివృద్ధి ఆగడం లేదని చెప్పారు. ప్రతీ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టామని తెలిపారు. అప్పట్లో డాక్టర్ సీటు రాక..విద్యార్థులు విదేశాలకు వెళ్లారని గుర్తుచేశారు. కేసీఆర్ 9 ఏండ్లలో 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించారన్నారు.