ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:శనివారం రోజున, జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా లీగల్ సర్వీస్ అథోరిటీ చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ .డి.రవీంద్ర శర్మ గారి * అధ్యక్షతన లోక్ అదాలత్ కి సంబంధించిన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఎక్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ శ్రీ.పి.శ్యామ్ కోసి, మెంబర్ సెక్రెటరీ ఎస్.గోవర్ధన్ రెడ్డి, హాజరయ్యారు,ఈ సందర్భంగా జస్టిస్ గౌరవ శ్యామ్ కోసి గారు మాట్లాడుతూ జిల్లాలో 9వ తేదీన నిర్వహించిన లోక్ అదాలత్ లో (3889) కేసులు పరిష్కరించి జనగామ జిల్లా ముందు వరుసలో ఉందని అందుకు జిల్లా జడ్జి రవీంద్ర శర్మను, సిబ్బందిని ఆయన అభినందించారు,న్యాయం కోసం కోర్టుకు వచ్చే ప్రతి వ్యక్తికి సత్వర న్యాయ సేవలు అందించాలన్నారు,

డిసెంబర్ 9, 2023న నిర్వహించే లోక్ అదాలత్ గురించి ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రచారం కల్పించి అధిక కేసులు పరిష్కరించాలని సూచించారు.
రెవెన్యూ మరియు పోలీసు అధికారులు..అన్ని శాఖల సమన్వయంతో కేసులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి సూచించారు.

జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ.డి.రవీంద్ర శర్మ గారు మాట్లాడుతూ
జిల్లాలో రెండు కోర్టుల పరిధిలో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, జిల్లాలో సిబ్బంది కొరత ఉందని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అదనపు కోర్టులో మంజూరు చేయవలసిందిగా కోరారు.

అంతకుముందు జిల్లాకు చేరుకున్న జస్టిస్ శ్యామ్ కోసి, గోవర్ధన్ రెడ్డిలకు పోలీసువారు గౌరవ వందనం అందించారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ మెంబర్ సెక్రెటరీ జడ్జి ఎస్.గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి డి.రవీంద్ర శర్మ, డిసిపి సీతారాం, సీనియర్ సివిల్ జడ్జి కం లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ సి.విక్రమ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఈ.సుచరిత, ఆర్డీవో మురళీకృష్ణ, ఏసిపి దేవేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.శ్రీనివాస్,జిల్లా డిఫెన్స్ న్యాయవాదులు జనగామ బార్ అసోసియేషన్ న్యాయవాదులు,ఇతర వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు మరియు సిబ్బంది ఉన్నారు.