Friday, June 27, 2025

హనుమకొండ-వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాట్లు.-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: హనుమకొండ, వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు.

శనివారం ఆయన మేయర్ గుండు సుధారాణి,కూడ కాన్ఫరెన్స్ హాల్లో కూడ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, కమిషనర్ రిజవాన్ బాషా తో కలిసి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల ఆరవ తేదీన మంత్రి కేటీ ఆర్ హైదరాబాద్ నుండి నేరుగా చాఫర్ లో kmc కి చేరుకుంటారు అని అన్నారు. అనంతరం mgm సమీపంలో పోలీస్ భరోసా కేంద్ర ప్రారంభోత్సవం తో జిల్లా పర్యటన ప్రారంభం కానున్నదని ఆయన అన్నారు. స్మార్ట్ సిటీ పనులు, డిజిటల్ లైబ్రరీ,ITటవర్స్,ఆరు జంక్షన్ ప్రారంభోత్సవాలు,వివిధ రకాల శంఖుస్థాపనల ప్రదేశాల్లో అన్ని సిద్ధం చేయాలని, అధికారులు తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు. రూట్ మ్యాప్ పై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.


ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58, 59, 76 మొదలగు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, లబ్ధిదారులకు సీటింగ్ అరేంజ్మెంట్ ప్రత్యేకంగా చేయాలని అయన సూచించారు.మంత్రి పర్యటన నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని,అన్నారు.అధికారులు వారి వారి శాఖల పరిధిలో చేపట్టే పనులు సజావుగా జరిగే విధంగా పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, డీసీపీ బారి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల, pd drda శ్రీనివాస్ కుమార్, deo అబ్దుల్ హై, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular