Friday, June 27, 2025

హనుమకొండ జిల్లా జిల్లాలో పర్యాటక శాఖ పర్యాటక ఉత్సవాలు-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:ప్రపంచ పర్యాటక దినోత్సవం, సెప్టెంబర్ 27 సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా పర్యాటక శాఖ పర్యాటక ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఈ ఏడాది ” పర్యాటకం మరియు హరిత పెట్టుబడులు” అనే అంశాన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నేపథ్యంలో మార్గ నిర్దేశం చేస్తున్నది..ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా పలు పర్యాటక మౌలిక వసతులు కల్పిస్తూ, ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది.పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27 న ఉదయం భద్రకాళి బండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బోటు షికారు ప్రారంభం కానుంది. అదే రోజు సాయంత్రం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయని జిల్లా పర్యాటక శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular