Friday, May 30, 2025

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కాంగ్రెస్ గెలిచేది లేదు..:మంత్రి హరీశ్ రావు

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కాంగ్రెస్ గెలిచేది లేదు.. బీజేపీ లేచేది లేదన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారని చెప్పారు. మోసపూరిత మాటలు చెప్పే కాంగ్రెస్ ను నమ్మొద్దని చెప్పారు. కొడంగల్ బహిరంగ సభలో మాట్లాడిన హరీశ్ రావు.. 3 గంటల కరెంట్ కావాలనుకున్న వాళ్లు.. కాంగ్రెస్ కు, 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని సూచించారు. కర్ణాటకలో రైతుబంధు, 4 వేల పెన్షన్ ఇవ్వని కాంగ్రెస్ తెలంగాణలో ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ చెప్పే మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దన్నారు.

కాంగ్రెస్ హయాంలో కొడంగల్ వెనుకబడిందన్నారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి ఉంటే ఇంకా పదేళ్లయినా మంచినీళ్లు రాకపోయేవన్నారు. గతంలో మూడురోజుల కోసారి నల్ల వచ్చేదని..ఇపుడు ప్రతి రోజు నీళ్లు వస్తున్నాయని చెప్పారు. పట్నం నరేందర్ రెడ్డి వచ్చాకే కొడంగల్ అభివృద్ధి జరిగిందని చెప్పారు.కొడంగల్ కు రేవంత్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు.మల్కాజ్ గిరికి పారిపోయిన రేవంత్..అక్కడ ఏం చేయలేదన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular