Friday, May 30, 2025

మహిళలపై వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మండిపడ్డారు…..

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :మహిళలపై వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మండిపడ్డారు. శాయంపేట మండలంలో బతుకమ్మ చీరల పంపణి కార్యక్రమంలో గండ్ర జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరలు నాసిరకంగా ఉన్నాయన్న మహిళలపై గండ్ర జ్యోతి సీరియస్​ అయ్యారు. ఇష్టం ఉంటే కట్టుకోండి… లేకపోతే పక్కకు పెట్టండి అని చెప్పారు. చీరల విషయంలో ఆడవాళ్లను మెప్పియాలంటే ఎవరి వల్లా కాదన్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు బుక్కెడు అన్నం పెడుతలేరు గానీ.. కేసీఆర్ ప్రేమతో చీరలు ఇస్తే ఇన్ని వంకలు పెడుతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గండ్ర జ్యోతి చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్​ గా మారాయి. చీరలు బాగోలేవని అన్నందుకు ఇలా సీరియస్ అవుతారా…? అని ప్రశ్నిస్తున్నారు పలువురు మహిళలు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular