Wednesday, July 16, 2025

ఉద్యోగ భద్రత లేక ఫీల్డ్ అసిస్టెంట్ల వెతలు

ఓరుగల్లు9 నేషనల్ టివి నిర్మల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 17 :

ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయడంలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషించే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పించి పే స్కేల్ వర్తింప చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సోమవారం నుంచి దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయించారు. ఆ మేరకు ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకవచ్చింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం కూలీలు వలస వెళ్ళకుండ ఉండడమే. ఈ పథకంలో ప్రతీ కుటుంబానికి వందరోజుల పని దినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్రంలో 53.09 లక్షల జాబ్ కార్డులను ఉపాధిహామీ కూలీలకు జారీ చేయగా, అందులో కోటి 10 లక్షల 77వేల మంది ఉన్నారు. క్షేత్ర స్థాయిలో ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లను కాంట్రాక్టు పద్దతిలో నియమించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారితో పాటు మహిళలు, దివ్యాంగులు ఎక్కువగా ఉన్నారు. వెలుగు ప్రాజెక్టు ద్వారా సెర్చ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉద్యోగ భద్రత కల్పించారు. అదే తరహాలో తమకు కూడా పే స్కేల్ వర్తింప జేయాలని కోరుతున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్ల విధులు ఇలా……

ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాల్లో ఏడాదికి సరిపడా ఉపాధి పనులను గుర్తించి జాబు కార్డులు కలిగిన కూలీలకు పనులు కల్పించాలి. పనులు జరిగే చోట ఉంటుంది. ఇంకుడు ఉదయం, సాయంత్రం ప్రత్యేక యాప్ లో కూలీల హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లోని నర్సరీ లను, ఏడు రకాల రిజిస్టర్లను నిర్వహించాల్సి మరుగుదొడ్ల నిర్మాణాలు, ఇతర పనుల్లో వీరి సేవలను వినియోగిం చుకుంటారు. గ్రామ పంచా యతీలో కార్యదర్శులకు సహా యంగా ఉంటారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాల్లో కూడామీరు భాగస్వాములుగా ఉంటున్నారు. అరకొర వేతనంఫీల్డ్ అసిస్టెంట్లను మూడు కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం వేతనాలు అందజేస్తున్నది. మొదటి కేటగిరీలో నెలకు 10 వేలు, రెండో కేటగిరీలో 11 వేలు, మూడో కేటగిరిలో 9 వేల రూపాయల వేతనం ఇస్తున్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ ఉద్యోగభద్రత లేక ఫీల్అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా అక్కడి ప్రభుత్వాలు గుర్తించి వేతనాలను అందజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్లుగాగుర్తించి నెలకు 18 వేల రూపాయల వేతనాన్ని అందజేస్తున్నది. తమకుకూడా ఉద్యోగభద్రత కల్పించి పేస్కేల్ వర్తింపచేయాలని కొంతకాలంగా ఆయా ప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు. కానీ వారి సమస్యలు నేటికీ తీరలేదు. 18సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో జీవితాలను నెట్టుకువస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular