Saturday, August 23, 2025

కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు: మంత్రి కేటీఆర్

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: 6 దశాబ్దాలు ఏం చేయనోళ్లు.. 6 గ్యారెంటీలు అని డైలాగ్ లు కొడుతున్నారని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. రాజకీయం కోసం ఢిల్లీలో చుట్టూ పైరవీలు చేసే వాళ్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో చేయాని పనిని బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో చేసి చూపెడుతుందన్నారు.

24 గంటల కరెంట్ ఇవ్వాలన్నా ఆలోచన కాంగ్రెస్ కు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తీగలు పట్టుకుంటే కరెంట్ వస్తుందో లేదో కాంగ్రెస్ నేతలకు తెలుస్తదని మంత్రి కేటీఆర్ అన్నారు.

మంచిర్యాల జిల్లాలో రూ. 313 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. చెన్నూరు అభివృద్ధిలో సిద్దిపేటతో పోటీపడుతోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని.. చెన్నూరు అభివృద్ధిని కూడా గమనించాలని తెలిపారు. త్వరలో చెన్నూరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular